Monday, 7 October 2013

అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహాలయం శిలాశాసనం

"శ్రీయుతు డంతర్వేది నరసింహులకున్ కొపనాతి యాదినా
రాయణుడాఢ్యుడై భగవదర్పిత బెద్ధిని వప్రసద్విమా
నాయత మంటపాదులు ప్రియంబున కొన్ని ఘటించి సాంగమున్
జేయగ నాత్మజాళికిని జెప్పినతోడగు రంగనాథుతో
ధీయుతుడైన కృష్ణుడది దివ్య మహామహిమన్ జలంగగా
హాయిగ శాలివాహన శకాబ్దము లింద్రియ వేదభూధరేం
ద్రాయత వద్ద నిల్పనగు 1745 తోరపు వత్సర మా స్వభానువం
దాయధి చైత్ర కృష్ణ దశమార్యమ వాసర వేళ భూరిజ
ల్వౌయకలంక భక్తి ఘనులౌనన నిచ్చె కృతార్థచిత్తుడై."

ఇది అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహాలయం దక్షిణగోడలో నైరుతిదిశగా ఉన్న శిలాశాసనం.
ఈ శాసనాన్నిబట్టి ఈ ఆలయ నిర్మాణం శాలివాహన శకం 1745 అనగా క్రీ.శ.1823నాటికి పూర్తయినట్లుగా తెలుస్తుంది. దేవాదాయ శాఖ వెబ్ సైట్ లో 1923 అని పేర్కొన్నారు.
అది ఇక్కడ http://www.antarvedisrilakshminarasimhaswamy.com/temple_history.php?task=next5 చూడవచ్చు.
మెడకాయమీద తలకాయ ఉన్నవాడెవడికైనా ఈ తెలుగు 1920 ప్రాంతాల్లో ఉన్న తెలుగు కాదన్నది అర్థమైపోతుంది. మీరూ చూడండి...

No comments:

Post a Comment